తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలను వచ్చే నెల 19న నిర్వహిస్తామని అధ్యక్షుడు సి కళ్యాణ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ప్రసన్నకుమార్, రామసత్యనారాయణ, వైవీఎస్ చౌదరి, మోహన్ వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి కళ్యాణ్ మాట్లాడుతూ…‘ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మూలధనం దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణల్లో నిజం లేదు. మా కౌన్సిల్లో 9 కోట్ల రూపాయల ఫండ్ ఉంది. అలాగే తిరుపతిలో సొంత భవనం, హైదరాబాద్ మూవీ టవర్స్లో 2 కోట్ల 40 లక్షల పెట్టుబడి ఉంది. మూవీ టవర్స్ పెట్టుబడి ఇప్పుడు 10 కోట్ల రూపాయల విలువకు చేరింది. ఫిబ్రవరి 19న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించాం. అదే రోజు కౌంటింగ్, సర్వసభ్య సమావేశం నిర్వహిస్తాం. మా కౌన్సిల్ పై నిరాధార చేస్తూ, నిత్యం వివాదాలు సృష్టిస్తున్న సభ్యులు కె సురేష్ బాబును మూడేండ్ల పాటు, యలమంచిలి రవిచంద్పై జీవితకాలం నిషేధం విధిస్తున్నాం. అన్నారు’.