తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో దుబాయ్లో వైభవంగా టిఎఫ్సీసీ సౌత్ ఇండియా నంది అవార్డుల వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్బంగా దుబాయ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నంది అవార్డులకు సంబంధించిన బ్రౌచర్ని హీరో సుమన్ చేతులమీదుగా ఆవిష్కరింపజేశారు. సుమన్ మాట్లాడుతూ ‘ఇప్పటివరకూ దుబాయ్లో ఉత్తరాదికి చెందిన సినిమా అవార్డులే జరిగాయి. ఈ సారి సౌత్ సినిమా అవార్డుల వేడుక జరుగనుండటం ఆనందంగా ఉంది. దీనికి కారకులైన తెలంగాణ ఫిల్మ్ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ని అభినందిస్తున్నాను.
ఈ అవార్డుల వేడుకతో తెలుగు సినిమా వైభవం మరింత తేజోవంతం కావాలి’ అని ఆకాంక్షించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినీరంగాలకు చెందిన నటీనటులతోపాటు 24శాఖలకు చెందిన సాంకేతిక నిపుణులకు కూడా ఈ అవార్డులు అందించడం జరుగుతుందని, ఈ వేడుక దుబాయ్లో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రతాని రామకృష్ణగౌడ్ తెలిపారు. ఇంకా టీ హోమ్స్ సీఏండీ వైకుంఠరావు, దుబాయ్ ప్రిన్స్ మేనేజర్ బిను చార్లీ, సీఏ రవికుమార్ సింగిరి తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.