హర్ష నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మిస్సింగ్’, శ్రీని జోస్యుల దర్శకుడు. భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మాతలు. ఈ నెల 29న విడుదలకానుంది. గురువారం ఈ సినిమాలోని ‘ఖుల్లమ్ ఖుల్లా..’అనే ప్రచార గీతాన్ని ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. ‘అంతా కొత్త వారితో ఈ సినిమా తీశాం. ఆద్యంతం ఉత్కంఠభరితమైన కథ, కథనాలతో సాగుతుంది. థ్రిల్లర్ జోనర్లో విభిన్న చిత్రంగా ఆకట్టుకుంటుంది’ అని దర్శకుడు తెలిపారు. రొమాన్స్, థ్రిల్లింగ్ అంశాలతో సాగే చిత్రమిదని నాయకానాయికలు తెలిపారు.