Raja Mouli : లాస్ఏంజెల్స్లో జరుగుతున్న గవర్నర్స్ అవార్డు వేడుకకు టాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ రాజమౌలి హాజరైన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన మిషన్ ఇంపాజిబుల్ డైరెక్టర్ జె.జె.అబ్రమ్స్ను కలిశాడు. అబ్రమ్స్ స్టార్ వార్స్, మిషన్ ఇంపాజిబుల్ 3 వంటి హిట్ సినిమాలు తీశాడు. ఆర్ఆర్ఆర్ అఫీషియల్ ట్విట్టర్ సంస్థ రాజమౌలి, అంబ్రాస్ కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసింది. దాంతో, ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతీయ సినిమాకు గర్వకారణం అంటూ ఒక అభిమాని ట్వీట్ చేశాడు.
గవర్నర్స్ అవార్డ్ ఫంక్షన్ అనేది అస్కార్ అవార్డులకు ముందు జరిగే సినిమా వేడుక. ఆస్కార్కి నామినేట్ అయిన సినిమా దర్శకులు, హీరోలు, హీరోయిన్లు అందరూ ఈ అవార్డు కార్యక్రమానికి హాజరవుతారు. ఈ అవార్డు ఈవెంట్తో ఆస్కార్ క్యాంపెయిన్ ఊపందుకుంటుంది. రామ్చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈసారి 14 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్ దాఖలు చేసింది. ఈసినిమాలో సముద్రఖని, శ్రియా శరణ్తో పాటు బాలీవుడ్ హీరో అజయ్దేవ్గన్, హీరోయిన అలియా భట్ అతిథి పాత్రలో నటించారు.
And the foRRRce continues to be with #RRRMovie 🔥🌊🤩
Hollywood filmmaker @JJAbrams, the director of Star Wars, Mission Impossible and many other remarkable movies, said that he is a 𝙃𝙐𝙂𝙀 𝙁𝘼𝙉 𝙤𝙛 #𝙍𝙍𝙍.
Glad to see @SSRajamouli meet him at the Governors Awards.❤️ pic.twitter.com/U2Jf9BYEGT
— RRR Movie (@RRRMovie) November 20, 2022