Vyuham Movie | ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మక తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వ్యూహం సినిమా విడుదలను హైకోర్టు సింగిల్ బెంచ్ రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. ఈ క్రమంలో పిటిషన్పై విచారించిన ధర్మాసనం.. ఈ నెల 9వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు ఆదేశించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ బుధ, గురువారాల్లో వానదలు విన్న విషయం తెలిసిందే.
తాజాగా సోమవారం ఇరువర్గాల వాదనలు పూర్తి చేసింది. వ్యూహం సినిమాను రాజకీయ నాయకులను కించపరిచేలా నిర్మించారని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్తో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి బెంచ్ సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన ధ్రువీకరణపత్రాన్ని రద్దు చేస్తూ గత నెల 22న తీర్పును వెలువరించింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్కుమార్, రామదూత క్రియేషన్స్ హైకోర్టులో అప్పీల్ చేసింది.
ఈ మేరకు సీజే జస్టిస్ అలోక్ అరధే, జస్టిస్ జే అనిల్కుమార్ ధర్మాసనం బుధ, గురువారాల్లో వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. మూవీ విడుదలకు ముందే సెన్సార్ బోర్డు అన్నింటిని పరిగణలోకి తీసుకోలేదని, సినిమా విడుదల చేయకుండా చూడాలని టీడీపీ నాయకులు హైకోర్టును కోరారు. అయితే, సర్టిఫికెట్ జారీ చేసే సమయంలో ప్రతి సినిమాకు రివైజింగ్ కమిటీ కారణాలు పేర్కొనాల్సిన అవసరం లేదని నిర్మాతలు వాదనలు వినిపించారు. తాజాగా సీజే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మరోసారి చిత్రాన్ని వీక్షించి ఈ నెల 9వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు సెన్సాన్ బోర్డును ఆదేశించింది.