దేశప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ‘ఓటు’. ఆ హక్కుని వినియోగించుకొని దేశ సమగ్రాభివృద్ధిలో భాగం కావాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికీ ఉంది. అందుకే సామాన్య ఓటర్లనుంచి సినిమా స్టార్ల దాకా, ప్రతి ఒక్కరూ గురువారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కుని వినియోగించుకునేందుకు పోలీంగ్ బూత్ల ముందు బారులు తీరారు.
తమ విలువైన సమయాన్ని అంతకన్నా విలువైన ఓటు కోసం వెచ్చించి భారతపౌరులుగా తమ బాధ్యతను నిర్వర్తించారు. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఓట్ల ఉత్సవం.. తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణాన్ని తలపించింది.