తేజ సజ్జా కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా సూపర్హీరో చిత్రం ‘హను-మాన్’. ప్రశాంత్ వర్మ దర్శకుడు.నిరంజన్ రెడ్డి నిర్మాత. గురువారం ఈ చిత్రం 100వ రోజు షూటింగ్ను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు హీరోకు ఎలాంటి డూప్లేకుండా చిత్రీకరిస్తున్నాం. హీరో తేజ చాలా కష్టపడి ఈ యాక్షన్ సన్నివేశాలను గాయాలు కూడా లెక్క చేయకుండా చేస్తున్నాడు’ అన్నారు. అమృత అయ్యర్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్కుమార్ కీలకపాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్ దేవ్, హరి గౌరా, జైక్రిష్, కృష్ణ సౌరభ్, సమర్పణ: చైతన్య