ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ఖాన్’. కల్యాణ్ జి గోగణ దర్శకుడు. డా॥ నాగం తిరుపతి రెడ్డి నిర్మాత. పాయల్రాజ్పుత్ కథానాయిక. ఈ నెల 19న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆది సాయికుమార్ మాట్లాడుతూ ‘పక్కా కమర్షియల్ చిత్రమిది.
పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. మాస్ను మెప్పించే అన్ని అంశాలుంటాయి’ అని చెప్పారు. సినిమాలో ఉండే మలుపులు ఉత్కంఠను పంచుతాయని నిర్మాత తెలిపారు. శ్రీకాంత్ అయ్యంగార్, అనూప్సింగ్ ఠాకూర్, కబీర్సింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల్రెడ్డి, సంగీతం: సాయికార్తీక్.