సినిమాల్లోకి వచ్చి హీరోయిన్గా రాణించిన తెలుగు అమ్మాయిలను చాలా తక్కువే అని చెప్పొచ్చు. అలాంటిది ఓ తెలుగమ్మాయి తెరపై హీరోయిన్గా కనిపించడమే కాక నిర్మాతగా వ్యవహరించడం.. ఇంకా ఆశ్చర్యపరిచేలా చిత్ర కథను సైతం అందించడం టాలీవుడ్ గొప్ప విషయమే. ఔను, ఇప్పుడు సుమయరెడ్డి బహుముఖ ప్రజ్ఞతో ఆకట్టుకోనున్నారు. సుమ చిత్ర ఆర్ట్స్ పతాకంపై ‘డియర్ ఉమ’ పేరుతో ఓ చిత్రం త్వరలో రాబోతోంది.
ఇందులో సుమయరెడ్డి, ‘దియా’ మూవీ ఫేమ్ పృథ్వీ అంబర్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ను వాలెంటైన్స్ డే సందర్భంగా బుధవారం విడుదల చేశారు మేకర్స్. ఇదో ప్రేమ కావ్యమని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ప్రేమ ఇచ్చే సంతోషాన్ని, బాధను ఓ దృశ్యకావ్యంగా మలిచినట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: రధన్, నిర్మాత: సుమయరెడ్డి, దర్శకత్వం: సాయి రాజేశ్ మహదేవ్.