అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముద్ర ఖని ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా ‘యానై’. రాధికా శరత్కుమార్, యోగిబాబు, కేజీఎఫ్ రామచంద్రరాజు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ‘ఏనుగు’ పేరుతో తెలుగులోకి వస్తున్నది. ఈ చిత్రాన్ని శ్రీమతి జగన్మోహినీ సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సీహెచ్ సతీష్ కుమార్ విడుదల చేస్తున్నారు.
హరి దర్శకుడు. సినిమా గురించి నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ..‘ఆద్యంతం వినోదాన్ని అందించే చిత్రమిది. సింగం సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హరి అదే స్థాయిలో మంచి కంటెంట్తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 17న సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాము’ అన్నారు.