హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆదివారం ఉదయం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. అతనికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఆయనే తమిళనాడుకు చెందిన సెల్వరాఘవన్. కరోనా నిర్ధారణ కావడంతో ఈ మధ్య కాలంలో తనను కలిసిన సినీ మిత్రులు, బంధువులు పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. ఆ పరీక్షల్లో పాజిటివ్గా తేలితే వారంపాటు హోమ్ ఐసోలేషన్లో ఉండాలని సూచించారు.
ప్రస్తుతం తాను హోమ్ ఐసోలేషన్లోనే ఉన్నానని 44 ఏండ్ల సెల్వరాఘవన్ తెలిపారు. ఆయన నెంజమ్ మరప్పతిల్లై, ఎన్జీకే, మయక్కమ్ ఎన్న లాంటి చిత్రాలు ఆయనకు తమిళ చిత్రసీమలో మంచి పేరుతెచ్చిపెట్టాయి. నేను ఇవాళ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నా. ఈ పరీక్షల్లో నాకు కొవిడ్ పాజిటివ్గా తేలింది. గత రెండుమూడు రోజుల్లో నన్ను కలిసిన వాళ్లందరూ కరోనా పరీక్షలు చేయించుకుని, ఐసోలేషన్లో ఉండాలని కోరుతున్నా అని సెల్వరాఘవన్ పేర్కొన్నారు.
కాగా, కేంద్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో ఇవాళ 3,33,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 3,92,37,264కి చేరింది.