Varasudu Movie | టాలీవుడ్లో దిల్ రాజు అనుకుంటే సాధ్యం కానిదేదీ లేదు. ఇక్కడ ఆయనకు అంత పట్టు ఉంది. తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా 20 ఏళ్లుగా సంచలనాలు సృష్టిస్తూ ముందుకు వెళుతున్నాడు దిల్ రాజు. ఎంత పోటీ ఉన్న తన సినిమాకు కావాల్సినన్ని థియేటర్లు తీసుకొచ్చుకోవడంలో ఈయనకు అన్ని పద్ధతులు తెలుసు. అయితే తమిళనాడులో మాత్రం కొత్త నిర్మాతగా అడుగు పెడుతున్నాడు దిల్ రాజు. అక్కడ ఇప్పటికే చాలామంది అగ్ర నిర్మాతలు ఉన్నారు. వచ్చీ రావడంతోనే ఏకంగా సంక్రాంతికి పోటీ పడుతున్నాడు. ఆయన నిర్మించిన ‘వారసుడు’ సినిమాతో పాటు.. అజిత్ ‘తునివు’ కూడా పొంగల్ రేసులో ఉంది.
ఇద్దరు అగ్ర హీరోలే కావడంతో అక్కడ ఉన్న స్క్రీన్స్ సరి సమానంగా పంచాలని డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించారు. తమిళనాడులో 800 యాక్టివ్ స్క్రీన్స్ ఉన్నాయి. ఎంత పెద్ద హీరో సినిమా విడుదలైన అక్కడ కేవలం 500 కంటే ఎక్కువ థియేటర్లు ఇవ్వరు ఒకేసారి రెండు సినిమాలు వస్తే కచ్చితంగా సమానంగా థియేటర్స్ ఇస్తారు ఇప్పుడు పొంగల్ కు అదే జరుగుతుంది అజిత్, విజయ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలు బరిలో ఉండడంతో వాళ్లకు చెరో 400 స్క్రీన్స్ ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించారు అయితే అజిత్ కంటే విజయ్ పెద్ద హీరో కాబట్టి తాను మరో 50 థియేటర్లైన అదనంగా ఇవ్వాలి అంటూ చెన్నై వెళ్లి తాను అడుగుతాను అంటూ దిల్ రాజు చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది.
ఈ మధ్య తమిళనాడులో జరిగిన డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్లో దిల్ రాజు విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. బయటి నుంచి వచ్చిన నిర్మాత మన హీరోల మధ్య చర్చ పెట్టడం ఏంటి అనే విషయంపై బయ్యర్లు కాస్త సీరియస్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. ఇద్దరు హీరోలకు సమానంగా థియేటర్లు ఇవ్వాలి కానీ ఎక్కువ థియేటర్లు ఇచ్చే సమస్య లేదు అంటూ అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాట చర్చ జరుగుతుంది. జనవరి 12న విజయ్ వారసుడు.. అజిత్ తునివు సినిమాలు విడుదల కానున్నాయి. తెలుగులో కూడా చిరంజీవి, బాలయ్య తో పోటీ పడుతున్నాడు విజయ్.