శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా ‘మహావీరుడు’. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ నాయికగా నటిస్తున్నది. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వా నిర్మిస్తున్నారు. మడోన్ అశ్విన్ దర్శకుడు. యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమా తాజాగా షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకుంది.
దర్శకుడు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి విషెస్ తెలిపారు. హీరోయిజం ఉండే ఓ కొత్త కాన్సెప్ట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని, కథా నేపథ్యం, హీరో క్యారెక్టరైజేషన్ ఆకట్టుకుంటాయని దర్శక నిర్మాతలు తెలిపారు. యోగిబాబు, సరిత, మిస్కిన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : ఫిలోమిన్ రాజ్, సినిమాటోగ్రఫీ : విధు అయ్యన్న, సంగీతం : భరత్ శంకర్.