మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆచార్య చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసిన చిరు ఇప్పుడు గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే గాడ్ ఫాదర్ చిత్ర షూటింగ్ మొదలు కాగా, భోళా శంకర్ చిత్రం నవంబర్ 11న అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. నవంబర్ 15 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
ఇప్పటికే చిరంజీవి, కీర్తి సురేష్లపై ఫోటో షూట్ చేసిన మెహర్ రమేష్.. తాజాగా చిరంజీవి(Chiranjeevi)పై ఈ సినిమా షూటింగ్కు సంబంధించిన టెస్ట్ షూట్ చేసారు. ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళంకి రీమేక్గా రూపొందనుంది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. ఇప్పటికే వారిద్దరికి సంబంధించిన పోస్టర్ ఒకటి విడుదలైంది. ఇక హీరోయిన్గా తమన్నా అని ఎప్పటి నుండో వార్తలు వస్తుండగా, తాజాగా అఫీషియల్ ప్రకటన చేశారు.
సైరా తర్వాత చిరుతో కలిసి నటిస్తుంది తమన్నా.ఈ సినిమా అవకాశం తనకు దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తుంది తమన్నా. భోళా శంకర్ (Bholaa Shankar) సినిమా కోసం మిల్కీబ్యూటీ దాదాపు 3 కోట్లు తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఇప్పటికే సగం అడ్వాన్స్ కూడా మేకర్స్ అప్పగించారని ఇన్ సైడ్ టాక్. ఇక ఇప్పటివరకు తమన్నా.. తన కెరీర్లో ఇంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోలేదట.