మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్లు, టీవీ షోలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న తమన్నా తన కాల్షీట్స్ని ఫుల్ బిజీగా ఉండేలా చూసుకుంటుంది. ఆచితూచి పాత్రలను ఎంపిక చేసుకుంటున్న ఈమె మంచి స్క్రిప్ట్లు వస్తేనే అంగీకరిస్తున్నారు. అలాగే, తనకు ఇష్టమైన డ్యాన్స్ను ప్రదర్శించడానికి స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు.
కొద్ది రోజులుగా తమన్నా బుల్లితెరపై ఓ షోతో సందడి చేయనుందని ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత అల్లు అర్జున్ నెలకొల్పిన ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ఫాం కోసం తమన్నా ఒక టాక్ షో చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కాని జెమినీ టీవీ కోసం తమన్నా షో చేస్తుంది. మాస్టర్ చెఫ్ పేరుతో ఈ షో రూపొందుతున్నట్టు తాజాగా విడుదలైన ప్రోమోని బట్టి తెలుస్తుంది. తెలుగు వంటలని ప్రపంచం అంతా గుర్తించేలా ఈ షోని రూపొందించినట్టు తెలుస్తుంది.
రామ్ చరణ్, రవితేజలు షోకి తొలి గెస్ట్లుగా వస్తారని సమాచారం. ఈ షోలో 20 ఎపిసోడ్స్ ఉంటాయని టాక్. అయితే, ఈ షో కోసం తమన్నా ఒక్కో ఎపిసోడ్కు తమన్నా రూ. 7 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని అంటున్నారు. అంటే, 20 ఎపిసోడ్లకు కలిపి సుమారు కోటిన్నర రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్తో కలిసి ‘సీటీమార్’ చిత్రంలో నటిస్తున్న తమన్నా ఎఫ్ 3లో వెంకీకి జోడిగా నటిస్తుంది.