Taapsee Pannu | ‘డంకీ’ చిత్రంతో ఇటీవల చక్కటి విజయాన్ని సొంతం చేసుకొంది పంజాబీ సుందరి తాప్సీ. ప్రస్తుతం సక్సెస్ జోష్లో ఉన్న ఈ భామ తన తదుపరి సినిమాల కోసం సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘యానిమల్’ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అలాంటి కథలో తాను నటించలేనని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘ఇతర నటీనటుల వ్యక్తిగత జీవితాల గురించి నేను మాట్లాడను. మనది ప్రజాస్వామ్య దేశం. ఎవరికి నచ్చింది వారు ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. నటీనటులందరికి ప్రతిభా పాటవాలతో పాటు కొన్ని బాధ్యతలు ఉంటాయి. వాటిని గౌరవిస్తూ నేను ముందుకు సాగుతాను. వ్యక్తిగతంగా మాత్రం నేను ఆ తరహా కథల్లో నటించలేను’ అని చెప్పుకొచ్చింది.
రణభీర్కపూర్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘యానిమల్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించింది. తండ్రీకొడుకుల అనుబంధం ప్రధానంగా న్యూఏజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే కొందరు మాత్రం ఈ సినిమాపై విమర్శలు చేశారు. హింస పాలు ఎక్కువగా ఉందని, మహిళల గౌరవాన్ని తగ్గించేలా సన్నివేశాలు ఉన్నాయని విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో తాప్సీ చేసిన వ్యాఖ్యలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి.