Taapsee Pannu | తన పెళ్లి గురించి సోషల్మీడియాలో వస్తున్న పుకార్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది అగ్ర కథానాయిక తాప్సీ. మార్చి నెలాఖరున రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వివాహం చేసుకోనుందని ప్రచారం జరుగుతున్నది. ఈ వార్తలపై తాప్సీ స్పందించింది. ‘ఇలాంటి వార్తలను ఎందుకు ప్రచారం చేస్తారో అర్థం కాదు. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యవహారాలపై సోషల్మీడియా వేదికగా స్పందించడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ఈ విషయంపై ఏం మాట్లాడదలచుకోలేదు. భవిష్యత్తులో కూడా ఇలాంటి వార్తలపై స్పందించను’ అంటూ సమాధానమిచ్చింది.
దీంతో ఈ అమ్మడి పెళ్లి వార్తలకు చెక్ పడ్డట్లయింది. డెన్మార్క్కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సీ గత కొన్నేళ్లుగా ప్రేమాయణాన్ని సాగిస్తున్నది. వీరిద్దరు కలిసి పలు ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరైన ఫొటోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. పదేళ్ల నుంచి అతనితో ప్రేమలో ఉన్నట్లు తాప్సీ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే పెళ్లి విషయంపై మాత్రం స్పందించడానికి అనేక సందర్భాల్లో నిరాకరించింది. ప్రస్తుతం తాప్సీ హిందీలో ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’ చిత్రంలో నటిస్తున్నది.