Tapsee Pannu | గత కొంతకాలంగా సోషల్మీడియాకు దూరంగా ఉంటున్నది పంజాబీ భామ తాప్సీ. ప్రస్తుతం ఆమె షారుఖ్ఖాన్ సరసన ‘డంకీ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ముచ్చటించింది తాప్సీ. వరుస సినిమా షూటింగ్లతో బిజీగా ఉండటం వల్ల మీడియాకు దూరంగా ఉన్నానని తెలిపింది. ‘డంకీ’ చిత్రం గురించి మాట్లాడుతూ ‘గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నా. నా పాత్ర తాలూకు షూటింగ్ ఇంకా కొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉంది. నా కెరీర్లోనే ఎంతో ప్రత్యేకమైన చిత్రమిది. షారుఖ్ఖాన్తో తెరను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.
ఈ సినిమాలో వినోదంతో పాటు అంతర్లీనంగా చక్కటి సందేశం ఉంటుంది. నా పాత్ర కూడా సర్ఫ్రైజింగ్గా అనిపిస్తుంది. దేశమంతా మాట్లాడుకుంటున్న గొప్ప చిత్రంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా. గత కొంతకాలంగా నా పూర్తి సమయాన్ని సినిమాలకే వెచ్చిస్తున్నా. అందుకే సోషల్మీడియాకు బ్రేక్ తీసుకున్నా’ అని చెప్పింది. ‘మిషన్ ఇంపాజిబుల్’ తర్వాత తెలుగులో మరే చిత్రాన్ని అంగీకరించలేదు తాప్సీ. హిందీలో మాత్రం ఆరు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.