Nikhil Siddartha | టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘స్వయంభూ’ (Swayambhu). ఇప్పటికే విడుదలైన టీజర్కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాగా, ఇప్పుడు ఈ చిత్రం మ్యూజికల్ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలోని మొదటి పాట ‘రా రా ధీవర’ (Ra Ra Dheevara) ఏప్రిల్ 16న విడుదల కాబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఒక యోధుడి స్ఫూర్తిని చాటిచెప్పే విధంగా సాగే ఈ గీతం ప్రేక్షకులను ఆకట్టుకోనుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ వేసవిలో ‘స్వయంభూ’ వెండితెరపై భారీ స్థాయిలో సందడి చేయనుంది.
After An epic Swayambhu Teaser Response .. Now we have An anthem celebrating the WARRIOR SPIRIT 💥⚔️#Swayambhu first single #RaRaDheevara out on April 16th 🔥🎼
BLASTING IN THEATRES THIS SUMMER 2026 @actor_nikhil @iamsamyuktha_ @NabhaNatesh @krishbharat20 pic.twitter.com/TSX0zXoUTY
— BA Raju’s Team (@baraju_SuperHit) April 11, 2026