బెల్లంకొండ గణేష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘స్వాతిముత్యం’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. వర్ష బొల్లమ్మ కథానాయిక. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్ట్ 13న విడుదలకానుంది. ఈ చిత్రంలోని ఓ ప్రేమ గీతాన్ని సోమవారం విడుదల చేశారు. ‘నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా..నీ మత్తులో మళ్లీ పడిలేస్తూ ఉన్నా..’ అంటూ సాగే ఈ పాట చక్కటి ప్రేమ భావనలకు అద్దం పట్టింది. ఈ గీతానికి కె.కె సాహిత్యాన్నందించగా, మహతి స్వరసాగర్ స్వరాల్ని సమకూర్చారు. ‘చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. చక్కటి కుటుంబ కథా చిత్రంగా ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సూర్య, సంగీతం: మహతి స్వరసాగర్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, రచన-దర్శకత్వం: లక్ష్మణ్ కె కృష్ణ.