తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. సూర్య కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘వీర్’ అనేది వర్కింగ్ టైటిల్గా పెట్టుకున్నారు. దర్శకుడు సిరుతై శివ ఈ చిత్రాన్ని పది భాషల్లో రూపొందిస్తున్నారు. త్రీడీ ఫార్మేట్లో రిలీజ్ కానున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ దిశా పటానీ నాయికగా నటిస్తున్నది.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్నది. ఇటీవలే కీలక షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ఈ వారంలో చెన్నైలో పలు లొకేషన్స్లో ఈ సినిమాలోని చారిత్రక సన్నివేశాల చిత్రీకరణ జరపబోతున్నారు. ఈ సినిమాలో సూర్య ఐదు విభిన్న క్యారెక్టర్స్లో నటిస్తుండటం విశేషం.