వెంకటేశ్ స్పీడ్ పెంచారు. ప్రస్తుతం ఆయన ‘సైంధవ్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. వెంకీ 75వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కాగా, ఈ లోపే తన తర్వాతి సినిమాకు కూడా పచ్చజెండా ఊపేశారు వెంకీ. భావోద్వేగ కుటుంబకథగా రూపొందనున్న ఈ చిత్రానికి సురేందర్రెడ్డి దర్శకత్వం వహించనున్నట్టు విశ్వసనీయ సమాచారం.
భూపతిరాజా తయారు చేసిన ఈ కథను ముందు పవన్కల్యాణ్తో చేయాలని సురేందర్రెడ్డి భావించారట. అక్కడ ఆలస్యమవుతుండటంతో వెంకీతో చేయడం సబబని భావించి, ఆయన్న సంప్రదించగానే వెంకటేశ్ ఓకే ఆనేశారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభ కార్యక్రమం జరుగనున్నట్టు తెలిసింది. మిగతా వివరాలు తెలియాల్సివుంది.