ఈ మధ్య సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చతోనే ఫేమస్ అవుతున్నారు నటి సురేఖ వాణి. ఈమె ఇస్తున్న వార్నింగులు.. చేస్తున్న కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య రెండో పెళ్లి చేసుకోవడంపై మనసులో మాట చెప్పింది సురేఖ. ఇప్పుడు ఈమె కూతురు కూడా ఇదే చేస్తుంది. సుప్రీత సైతం అమ్మతో కలిసి అందాల రచ్చ చేస్తుంది. పైగా అమ్మకు ధీటుగా కాంట్రవర్సీలు కూడా బాగానే చేస్తుంది ఈ భామ.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టింది ఈ బ్యూటీ. తన తల్లికి రెండో పెళ్లి చేస్తానంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చింది సుప్రీత. మరోవైపు సురేఖ వాణి మాత్రం తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్ధేశ్యమే లేదని చెప్పింది. కూతురు మాత్రం అమ్మ ఒప్పుకుంటే రెండో పెళ్లి చేసుకుంటానని తెలిపింది. దాంతో పాటు తన తండ్రి మరణం గురించి కూడా ఓపెన్ అయిన సుప్రీత. యాంకర్గా కెరీర్ను ప్రారంభించిన సురేఖ తెలుగులో ఎన్నో సినిమాలు చేసింది. తమిళంలోనూ ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడ కూడా భారీ సినిమాలలో నటించింది సురేఖ వాణి.
ఇప్పుడు సినిమాలు చేయకపోయినా కూడా కూతురుతో కలిసి అందాలన్నీ ఆరబోస్తుంది సురేఖ వాణి. మరోవైపు సుప్రీత సైతం ఇదే చేస్తుంది. ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలంటే అందాలన్నీ ఆరబోయాల్సిందే అని ఫిక్సైపోయింది. తన తల్లి రెండో పెళ్లి గురించి రాసినందుకు అప్పట్లో జర్నలిస్టులపై మండిపడింది సుప్రీత. నిజానిజాలు తెలుసుకోకుండా ఏది పడితే అది రాస్తే ఎలా అంటూ ఫైర్ అయింది. ఉన్నవి రాయండి.. లేనివి క్రియేట్ చేసి రాయకండి.. అంటూ ఫైర్ అయింది సుప్రీత.
ఇప్పుడు మాత్రం తన తల్లికి తానే రెండో పెళ్లి చేస్తానని చెప్తుంది. ఇదిలా ఉంటే తన తండ్రి చనిపోయినపుడు కనీసం ఒక్కరు కూడా రాలేదని.. తన తండ్రి తరఫు బంధువులు కనీసం పాడె మోయడానికి కూడా రాలేదని చెప్పి ఏడ్చేసింది సుప్రీత. తల్లి తరఫు బంధువులు మాత్రమే తన తండ్రి పాడె మోసారని.. తానే తలకొరివి కూడా పెట్టాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది సుప్రీత. తన కుటుంబ సభ్యులు ఎవరూ తండ్రిని పట్టించుకోలేదని.. మరణాన్ని కూడా పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. సుప్రీత చెప్పిన విషయాలన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.