కరోనా వలన ప్రజలకు వినోదమే కరువైంది.థియేటర్స్ మూతపడడంతో టీవీకే పూర్తిగా అతుక్కుపోయారు.అయితే బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ మొదలైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి, అది ఎప్పుడు మొదలవుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్గా సీజన్ 5కి సంబంధించిన అప్డేట్ ఇచ్చిన మేకర్స్ మరి కొద్ది రోజులలో మొదలు కానున్నట్టు పేర్కొన్నారు.
గత కొద్ది రోజులుగా సీజన్5 కి సంబంధించిన కంటెస్టెంట్ లిస్ట్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఇందులో ఎవరుంటారో ఎవరుండరో తెలియదు కాని లిస్ట్ మాత్రం జోరుగా చక్కర్లు కొడుతుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూడా షోలో పాల్గొనబోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్పందించింది. తాను బిగ్బాస్ షోకి వెళ్లడం లేదని, దయ చేసి ఇలాంటి రూమర్స్ని ఎంకరేజ్ చేయకండని ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది.
సురేఖ బిగ్బాస్ హౌస్లోకి వెళ్లడం లేదని అందరు భావించే లోపే సురేఖ వాణి ఆ పోస్ట్ని కొద్ది క్షణాల్లోనే డిలీట్ చేసి అందరిని సస్పెన్స్లోకి నెట్టింది. సెప్టెంబర్ 5వ తేదిన ఈ షోను ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నట్టు సమాచారం. నాగార్జుననే ఈ షోకి హోస్ట్ ఉంటారని సమాచారం.
కంటెస్టెంట్గా యాంకర్ రవి, యాంకర్ వర్షిణి, గెటప్ శ్రీను, రఘు మాస్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియా, సురేఖ వాణి, సీరియల్ యాక్ట్రెస్ నవ్య స్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, ప్రేమకావాలి హీరోయిన్ ఈషా చావ్లా, యూట్యూబర్ సిరి హనుమంతు, లోబో, సింగర్ మంగ్లీ, టిక్ టాక్ స్టార్ దుర్గా రావు, సీరియల్ నటులు సిద్ధార్థ్ వర్మ-విష్ణు ప్రియ, టీవీ 9 ప్రత్యూష పేర్లు హల్ చల్ చేస్తున్నాయి.