డా॥ మురళీమోహన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సుప్రీమ్ వారియర్స్’ చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. హరిచందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి పెదపూడి బాబురావు నిర్మాత. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ..ఈ కథలో కొత్తదనం బాగా నచ్చిందని చెప్పారు.
యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, వివిధ భాషల నుంచి పేరున్న హీరోలు నటిస్తారని, ఆ వివరాలను త్వరలో వెల్లడిస్తానని హీరో, నిర్మాత పెదపూడి బాబురావు తెలిపారు. ఎనిమిది పాత్రల చుట్టూ ఈ కథ నడుస్తుందని, మురళీమోహన్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు. బాబూ రావు, మహిమా చౌదరి, కల్పన, ఆదిత్యఓం, పృథ్వీరాజ్ తదితరులు ఈ చిత్ర తారాగణం.