జయాపజయాలతో సంబంధం లేకుండా తిరుగులేని స్టార్డమ్తో దూసుకుపోతున్నారు సూపర్స్టార్ రజనీకాంత్. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో ‘లాల్ సలామ్’ అనే చిత్రంలో అతిథి పాత్రను పోషించనున్నారు.
ఈ సినిమా కోసం కేవలం వారం రోజుల పాటు డేట్స్ కేటాయించారు రజనీకాంత్. అందుకోసం ఆయన దాదాపు 30కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని చెన్నై సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. అతిథి పాత్ర అయినా..రజనీకాంత్ తెరపై కనిపిస్తే చాలు అంచనాలు ఆకాశాన్నంటుతాయి కాబట్టి ఆ స్థాయిలో భారీ పారితోషికం తీసుకుంటున్నారని అభిమానులు చెబుతున్నారు. ఈ సినిమాలో విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. క్రికెట్ నేపథ్య కథ ఇది.