Maheshbabu New Business | ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు కేవలం సినీరంగానికే పరిమితం కాకుండా ఇతర రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వ్యాపారం రంగంలో రాణిస్తున్నారు. ఇప్పటికే పెద్ద పెద్ద స్టార్లు పలు రకాల బిజినెస్లు చేస్తూ సక్సెస్ ఫుల్ లైఫ్ను లీడ్ చేస్తున్నారు. అందులో మహేష్బాబు మొదటి స్థానంలో ఉంటాడు. నటుడిగా, నిర్మాతగా, వ్యాపార వేత్తగా రెండు చేతుల్లో సంపాదిస్తున్నాడు. ఇప్పటికే మహేష్ మల్టీప్లెక్స్ బిజినెస్లోకి ఎంటరైన విషయం తెలిసిందే. ఈయన పేరుమీదున్న AMB సినిమాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్లలో ఒకటి. ఇక మహేష్ కేవలం థియేటర్ బిజినెస్ మాత్రమే కాకుండా క్లోతింగ్ బిజినెస్ కూడా చేస్తున్నాడు. ఆయన సతీమణి నమ్రత ఈ బిజినెస్లను చూసుకుంటుంది. ఇదిలా ఉంటే మహేష్బాబు తాజాగా మరో బిజినెస్లోకి ఎంటరవుతున్నాడు.
మహేష్బాబు తాజాగా రెస్టారెంట్ బిజినెస్లోకి ఎంటరయ్యాడు. మినర్వ గ్రూప్తో కలిసి బంజారాహిల్స్లో రెస్టారెంట్ బిజినెస్ను స్టార్ట్ చేస్తున్నాడు.ఇప్పటికే రెస్టారెంట్ ప్లాన్ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇటీవలే ఈయన నటించిన ‘సర్కారు వారి పాట’ విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రం మహేష్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన సినిమాగా రికార్డు సృష్టించింది. అయితే ఫైనల్గా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మాత్రం సాధించలేకపోయింది. ఇక మహేష్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇప్పటికే వీళ్ళ కాంబోలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ క్లాసిక్స్గా మిగిలాయి. మూడో సారి ఈ కాంబో రిపీటవడంతో అభిమానుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న ఈ చిత్రంలో త్వరలో షూటింగ్ మొదలు పెట్టనుంది.