Super Star Mahesh Babu | సౌత్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుల్లో మహేష్బాబు ఒకడు. కేవలం నటుడిగానే కాకుండా పలు రకాల బిజినెస్లతో కూడా కోట్లు అర్జిస్తున్నాడు. ఇక మహేష్ బాబు ఆయన స్టేటస్కు తగ్గట్లే ఖరీదైన కార్లు వాడుతుంటాడు. తన గ్యారేజీలో ఇప్పటికే కోట్ల విలువైన కార్లు ఉన్నాయి. కాగా తాజాగా ఈ లిస్టులో బ్రాండ్ న్యూ రేంజ్ రోవర్ ఎస్వీ కారు వచ్చి చేరింది. బంగారు గోధుమ వర్ణంలో ఉన్న ఈ కారు ఖరీదు ఐదున్నర కోట్లకు పై మాటే. ప్రస్తుతం జరుగుతున్న గుంటూరు కారం షూటింగ్ సెట్స్కు మహేష్బాబు ఈ కారులో వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక ప్రస్తుతం మహేష్ గుంటూరు కారం షూటింగ్లో బిజీగా ఉన్నాడు. గతేడాది ప్రారంభంలోనే మొదలైన ఈ సినిమా ఇప్పటికే సగం షూటింగ్ను కూడా పూర్తి చేసుకోలేదు. ఆది నుంచి ఈ సినిమాకు ఎదురు దెబ్బలే తగులుతూ వచ్చాయి. రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాక ఏకంగా స్క్రిప్ట్నే మార్చేశారంటే ఇదేమి విడ్డూరం అనిపించింది. ఆ తర్వాత మహేష్ ఇంట్లో విషాదాలు, వెకేషన్లు ఇలా చూస్తుండగానే నెలలు గడిచిపోయాయి. మరోవైపు త్రివిక్రమ్ కూడా ఇతర ప్రాజెక్ట్లతో బిజీ అయిపోయాడు. ఇక ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్కు మోక్షం కలిగి ఈ ఏడాది ప్రారంభంలో షూట్ను రీ స్టార్ట్ చేశారు. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్తో చక చకా షూటింగ్ పరుగులు పెడుతుంది.
అంతా సవ్యంగా జరుగుతుందనుకున్న టైమ్లో థమన్, పూజాహెగ్డేలు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు జోరుగా ప్రాచారం జరిగింది. కాగా తమన్ గురించి వచ్చింది తప్పుడు ప్రాచారమే అయినా.. పూజా మాత్రం డేట్స్ అడ్జెస్ట్ చేయలక సినిమా నుంచి తప్పుకుందట. దాంతో ఆమె ప్లేస్ను శ్రీలీల రీప్లేస్ చేసింది. సెకండ్ హీరోయిన్గా ప్రాజెక్ట్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల మెయిన్లీడ్గా మారిపోయింది. ఇక సెకండ్ హీరోయిన్గా మీనాక్షీ చౌదరీని అనుకంటున్నట్లు సమాచారం.