బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం 19 మంది సభ్యులతో మొదలు కాగా, ప్రస్తుతం హౌజ్లో ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఇందులో శ్రీరామ్ ఇప్పటికే టాప్ ఫైనలిస్ట్ చోటు సంపాదించుకున్నాడు. ఇక సెకండ్ ఫైనలిసక్ట్ ఎవరు అనే విషయాన్ని నాగార్జున శనివారం ప్రకటించాడు. సన్నీని సెకండ్ ఫైనలిస్టుగా ప్రకటించారు. దీంతో అతడి ఆనందం హద్దులు దాటింది. ఇక హౌస్మేట్స్ను మరోసారి 1 నుంచి 6 ర్యాంకుల వరకు నిల్చోమన్నాడు నాగ్.
కాజల్, సిరి తప్ప మిగతా మేల్ కంటెస్టెంట్స్ అంతా మొదటి స్థానం తమదే అన్నారు. దీంతో నాగ్.. అమ్మాయిలిద్దరు మాత్రమే రెండో స్థానానికి సరిపెట్టుకుంటున్నారని మండిపడ్డాడు. దీంతో సిరి తన మాటను వెనక్కు తీసుకుంటూ వెళ్లి ఫస్ట్ ర్యాంక్పై నిలబడింది. శ్రీరామ్, కాజల్, షణ్ముఖ్, సన్నీ, మానస్ వరుసగా రెండు నుంచి ఆరు స్థానాల వరకు నిలబడ్డారు. ఇక ఈ రోజు హౌజ్ నుండి ఒకరు ఎలిమినేట్ కానుండగా, అది కాజల్ అని తెలుస్తుంది.
సన్నీ టాప్ ఓటింగ్తో దూసుకుని పోగా.. తరువాతి స్థానంలో షణ్ముఖ్ నిలిచాడు.. సిరి కూడా సేఫ్ కావడంతో.. మానస్-కాజల్ల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఇందులో కాజల్ వెనుకబడిపోవడంతో మానస్ సేఫ్ అయ్యి కాజల్ ఎలిమినేట్ అయినట్టు లీక్ బయటకు వచ్చింది. షణ్ముఖ్ ప్రవర్తన జనాలకు చిరాకు తెప్పిస్తున్న క్రమంలో అతను ఎలిమినేట్ అవుతాడంటూ ప్రచారం నడిచింది. అయితే షణ్ముఖ్ ఖచ్చితంగా టాప్ 5లో ఉండడం ఖాయంగా కనిపిస్తుంది.