బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌజ్లో కేవలం 5గురు సభ్యులు మాత్రమే ఉండగా, వారు తమ ఎమోషనల్ జర్నీ వీడియోలని చూసి భావోద్వేగానికి గురవుతున్నారు. ముందు ఎపిసోడ్లో తన జర్నీ వీడియో చూసి కేక్ పట్టుకొని ఇంట్లోకి వచ్చిన సన్నీ దానిని అందరితో షేర్ చేసుకున్నాడు. అనంతరం అందరితో కలిసి స్టెప్పులు వేశాడు.
ఎప్పుడు బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లతో బిజీగా ఉండే వారు ఈ వారం టాస్క్లు ఏమి లేకపోవడంతో దాగుడుమూతలు ఆడారు. సన్నీ ఎక్కడ దొంగలు అక్కడే గప్ చుప్ అని మొదటిగా మానస్ని దొంగగా పట్టేశాడు. చాలా రోజుల తరువాత ఈ ఐదురుగు సరదాగా గేమ్ ఆడి ఎంటర్ టైన్ చేశారు. సన్నీ అయితే పొట్టచెక్కలు చేసే కామెడీ చేశాడు. అతని క్యాస్టూమ్ కూడా డిఫరెంట్గా ఉంది.
అనంతరం సన్నీ తన ఫ్రెండ్ మానస్ని ఇంటర్వ్యూ చేస్తూ వినోదం పంచాడు. సీజన్ మొత్తంలో నీకు ఎవరి గేమ్ నచ్చదు అని అడిగాడు. దీంతో శ్రీరామ్ ఆట తనకి నచ్చదని చెప్తూ.. ఫస్ట్ నుంచి ఇప్పటివరకూ శ్రీరామ్తో కనెక్ట్ కాలేదన్నాడు.తర్వాత సన్నీ అడిగిన పలు విషయాలకు ఆసక్తికర సమాధానలు చెప్పాడు.