సన్నీ నవీన్, రోహిణీ రేచల్ జంటగా నటిస్తున్న సినిమా ‘జైత్ర’. ఈ చిత్రాన్ని అల్లం శ్రీ తన్మయి సమర్పణలో ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్ పతాకంపై అల్లం సుభాష్ నిర్మిస్తున్నారు. తోట మల్లికార్జున దర్శకుడు. ఈ నెల 26న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ట్రైలర్ను హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు తోట మల్లికార్జున మాట్లాడుతూ…
‘మట్టితో అనుబంధం పెంచుకున్న రైతు కథ ఇది. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాం. సహజత్వంతో సినిమా సాగుతుంది’ అన్నారు. హీరో సన్నీ నవీన్ మాట్లాడుతూ…‘రాయలసీమ నేపథ్యం అంటే ఫ్యాక్షన్ కథలు అనుకుంటారు గానీ అందుకు భిన్నంగా ఓ రైతు కథను ఈ చిత్రంలో చూపించబోతున్నాం. టీజర్, పాటలకు దక్కిన ఆదరణ సినిమాకూ వస్తుందని ఆశిస్తున్నాం’ అన్నారు.