ముంబై : గదర్ 2 గ్రాండ్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ (Sunny Deol) తన రెమ్యూనరేషన్కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. గదర్ 2 విడుదలై నెల రోజులు దాటినా వసూళ్ల సునామీ కొనసాగడంతో చిత్ర బృందం ఖుషీగా ఉంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడంతో సన్నీ డియోల్ తన రెమ్యూనరేషన్ను రూ. 50 కోట్లకు పెంచారని ప్రచారం సాగుతోంది.
ఈ వార్తలను సన్నీ డియోల్ తోసిపుచ్చారు. తాను డబ్బు కోసమే సినిమాలు చేయనని చెప్పారు. నటుడికి ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వాలనేది తాము ఆ మూవీ ద్వారా ఎంత సంపాదిస్తామనే దాన్ని బట్టి నిర్మాతలు నిర్ణయిస్తారని అన్నారు. ప్రొడ్యూసర్ తనకు అంతమొత్తం ఇవ్వచ్చు అనుకుంటే తనకు అంగీకారమేనని చెప్పకొచ్చారు.
తాను నిర్ధిష్ట మొత్తం ఇవ్వలేదని ఏ ప్రాజెక్టునూ తాను నిరాకరించలేదని గుర్తుచేశారు. తాను డబ్బు కోసం అలా పనిచేయనని, ప్రాజెక్టుకు తాను భారం కాదలుచుకోనని సన్నీ డియోల్ స్పష్టం చేశారు. ఇక గదర్ 2 అత్యంత వేగంగా రూ. 450 కోట్లు కలెక్ట్ చేసిన మూవీగా న్యూ రికార్డు సెట్ చేసింది.
Read More :