సింగర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, యాంకర్గా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించిన సునీత ఈ మధ్య రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న సునీత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్లో ఉంటుంది. ఈ క్రమంలో అనేక సంగతులు చెప్పుకొస్తుంది. తాజాగా తన జీవితంలో ఎదుర్కొన్న అవమానం గురించి మాట్లాడి అందరికి షాకిచ్చింది.
ఓ సారి ప్రముఖ సంగీత దర్శకుడి స్టూడియోలో పాటను పాడేందుకు వెళ్లిన సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ నాకు చేతికి మైక్ ఇచ్చాడు. పాట పాడటం పూర్తి అయిన తర్వాత మళ్లీ ఆ మైక్ ను అక్కడ పెట్టేసి వచ్చాను. పాట పాడి వెళ్లి పోతున్న సమయంలో అక్కడే ఉన్న ఆ మ్యూజిక్ డైరెక్టర్ బార్య పిలిచి, మైక్ తీసుకున్న సమయంలో నీవు ఆయన చేతిని నీ వేళ్లతో ఎందుకు టచ్ చేశావు, ఏమనుకుంటున్నావు అని సీరియస్ అయింది.
నేను చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాను. కాకపోతే ఆమె అన్న మాటలు చాలా బాధించాయి. ఆ రోజు రాత్రి అంతా కూడా ఏడ్చేశాను. ఆమె వ్యాఖ్యలకు అదే స్థాయిలో సమాధానం ఇచ్చినా కూడా నేను మాత్రం చాలా బాధ పడ్డాను. రికార్డింగ్ స్టూడియోకు వెళ్లిన సమయంలో చాలా సార్లు చాలా రకాల అవమానాలు ఎదుర్కొన్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.