తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన పాలక మండలిని ప్రకటించారు. వైస్ ప్రెసిడెంట్స్గా వీఎల్ శ్రీధర్, వాసుదేవ రావు చౌదరి, సెక్రటరీగా కె.అనుపమ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా బాలగోవింద్ రాజ్, కోశాధికారిగా చంద్రశేఖర్ రావు ఎన్నికయ్యారు.
వీరితో పాటు 15 మంది కార్యవర్గ సభ్యులకు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్గారితో త్వరలో తెలుగు ఇండస్ట్రీ సమావేశం ఉంటుంది. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై సినీ పెద్దలు కేసీఆర్గారితో చర్చిస్తారు. హైదరాబాద్లో ఫిలిం స్టూడియో, ఫిలిం సిటీలు ప్రధానాంశాలుగా ఈ సమావేశం ఉండబోతుంది’ అన్నారు. అందరికి అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని సునీల్ నారంగ్ పేర్కొన్నారు.