‘టైగర్’ చిత్రం తర్వాత హీరో సందీప్కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్ కలయిక మరోసారి వెండితెరపై ఆవిష్కృతం కాబోతుంది. సందీప్కిషన్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం తాజా చిత్రాన్ని ప్రకటించారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ నిర్మించనున్నారు. సూపర్నాచురల్ ఫాంటసీ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. అనౌన్స్మెంట్ పోస్టర్లో పురాతన కాలాన్ని తలపిస్తున్న ఓ ప్రదేశంలో దేని కోసమో అన్వేషిస్తూ సందీప్కిషన్ కనిపిస్తున్నారు. ‘కొవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టగానే రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభిస్తాం. త్వరలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని వెల్లడిస్తాం’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాత: బాలాజీ గుట్ట. ‘మాయవన్’ సీక్వెల్లో..సందీప్కిషన్ హీరోగా సీవీ కుమార్ స్వీయ దర్శకత్వంలో 2017లో రూపొందిన తమిళ చిత్రం ‘మాయవన్’ విమర్శకుల ప్రశంసల్ని అందుకొన్నది. తాజాగా ఈ సినిమాకు ‘మాయవన్ రీలోడెడ్’ పేరుతో సీక్వెల్ను తెరకెక్కించబోతున్నట్లు దర్శకనిర్మాత సి.వి.కుమార్ ప్రకటించారు. ఈ సీక్వెల్లోనూ సందీప్కిషన్ హీరోగా నటించబోతున్నట్లు వెల్లడించారు.