సందీప్ కిషన్ కథానాయకుడిగా రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందనున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘పవర్ పేట’. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ని గురువారం మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్ని గమనిస్తే.. వ్యూహం, శక్తి, త్యాగాన్ని సూచించేలా రక్తంతో తడిసిన చెస్ బోర్డ్ కనిపిస్తున్నది. విరిగిపోయిన, కూలిపోయిన చెస్ పీసులు ఏదో కథ చెబుతున్న అనుభూతిని కలిగిస్తున్నాయి.
ఈ గందరగోళం మధ్య నలిగిపోయిన ఓ గులాబీ పువ్వు రక్తంతో ముద్రింపబడి కనిపిస్తున్నది. ప్రేమ, గౌరవం, రాజకీయాల మేళవింపుగా సాగే భావోద్వేగపూరిత కథాంశమిదని మేకర్స్ చెబుతున్నారు. సందీప్కిషన్ పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మదీ, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్.