యాచారం, మార్చి 31: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ధరణి పోర్టల్ పనితీరు భేషుగ్గా ఉందని సీఏజీ డిప్యూటీ డైరెక్టర్ పూనం కుల్హరి అన్నారు. మండల తాసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం ఆమె కేంద్రం బృందం అధికారు లతో కలిసి సందర్శించారు. ధరణి పోర్టల్ పనితీరును తాసీల్దార్ నాగయ్యను అడిగి తెలుసుకున్నారు. భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించి అనేక విషయాలను ఆపరేటర్ నర్సింహాచారిని అడిగి తెలుసుకున్నారు. స్లాట్ బుకింగ్, మ్యుటేషన్, నాలా, విరాసత్, పాస్బుక్కుల అందజేత విధానంపై రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సుకన్య సమక్షంలో ప్రధానమంత్రి కిసాన్యోజన పథకం అమలుతీరుపై వ్యవసాయాధికారులను అడిగి తెలుసుకున్నారు.
మండలంలోని గడ్డమల్లయ్యగూడ గ్రామంలో రైతులతో సమావేశమై పీఎం కిసాన్యోజనపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ పనితీరు అద్భుతంగా ఉందన్నారు. ధరణి పోర్టల్తో రైతులకు దీర్ఘకాలిక సమస్యలు తీరడం అభినందించాల్సిన విషయమన్నారు. పదినిమిషాల్లో పట్టాదారుపాసుబుక్కు భూమి హక్కు పత్రాలు రైతులకు అందడం అభినందనీయమన్నారు. ధరణి పోర్టల్ను మరింత ముందుకు తీసుకుపో యేందుకు అధికారులు కృషిచేయాలన్నారు. ప్రధానమంత్రి కిసాన్యోజన పథకంను మం డలంలో సక్రమంగా అమలు చేసేందుకు వ్యవసాయధికారు లు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారిణి గీతారెడ్డి, ఇబ్రహీంపట్నం ఏడీఏ సత్యనారాయణ, మండలాధికారి సందీప్ పాల్గొన్నారు.