తమిళ అగ్రనటుడు ధనుష్ స్వీయదర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రాయన్’. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ధనుష్ 50వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో సందీప్ కిషన్, అపర్ణ బాలమురుగన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 13న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా సందీప్కిషన్, అపర్ణ బాలమురుగన్ నటించిన ప్యూర్ మెలొడీ సాంగ్ని మేకర్స్ విడుదల చేశారు.
‘నీ ఇకఇకలే కన్నుకొట్టాయా.. నడుం లకలకలే కచ్చగట్టాయా.. మజాగా మడతేస్తివే పీచుమిఠాయా..’ అంటూ సాగే పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా, ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచారు. విజయ్ప్రకాశ్, హరిప్రియ ఆలపించారు. ఈ మెలొడీ సాంగ్ స్లో పాయిజన్లా శ్రోతలకు ఇంజెక్ట్ అవుతుందని, చిత్రీకరణ కూడా ఆకర్షణీయంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. కాళిదాస్ జయరామ్, ఎస్.జె.సూర్య, సెల్వరాఘవన్, దుషార విజయన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఓం ప్రకాశ్.