‘రంగస్థలం’లో రంగమ్మత్తగా, ‘పుష్ప’లో దాక్షాయణిగా అలరించిన నటి అనసూయ భరద్వాజ్ ‘విమానం’ చిత్రంలో మరో విభిన్న పాత్రలో మెప్పించడానికి సిద్ధమవుతున్నది. ఆమె నటిస్తున్న ఈ తాజా చిత్రంలో సుమతిగా వైవిధ్యమైన పాత్రలో కనిపించనుంది. ఆమె పాత్రకు సంబంధించిన లిరికల్ వీడియోను ఈ నెల 22న విడుదల చేస్తున్నారు. సముద్రఖని, అనసూయ భరద్వాజ్, మాస్టర్ ధ్రువన్, మీరాజాస్మిన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘విమానం’. శివప్రసాద్ యానాల దర్శకుడు. జీస్టూడియోస్తో కలిసి కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘వైవిధ్యమైన కథాంశమిది. ఎమోషనల్ జర్నీగా ఆకట్టుకుంటుంది. అనసూయ పాత్ర బోల్డ్గా ఉంటూనే ఎమోషనల్ టచ్తో సాగుతుంది. అంగవైకల్యం ఉన్న తండ్రి పాత్రలో సముద్రఖని నటన అందరి మనసుకు హత్తుకుంటుంది’ అన్నారు.