Prasanna Vadanam | టాలీవుడ్ యువ నటుడు సుహాస్ మరో డిఫరెంట్ కాన్సెప్ట్తో ముందుకువస్తున్నాడు. ఇప్పటికే ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమాతో హిట్ కొట్టిన ఈ హీరో తాజాగా ‘ప్రసన్నవదనం’ అంటూ వస్తున్నాడు. ఈ సినిమాకు అర్జున్ వైకే దర్శకత్వం వహిస్తుండగా.. పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా.. ప్రేక్షకుల వద్ద నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ విడుదల తేదీని అనౌన్స్ చేసింది.
ఈ మూవీని సమ్మర్ కానుకగా మే 03న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక లిటిల్ థాట్స్ సినిమాస్, అర్హ మీడియా బ్యానర్పై మణికంఠ JS, ప్రసాద్ రెడ్డి TR సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఫేస్ బ్లైండ్నెస్ అనే వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి ఒక సమస్య ఎదురవుతుంది. ఇక ఆ సమస్య నుంచి అతడు ఎలా బయటపడ్డాడు అనేది సినిమా స్టోరీ.
Suhas’s #PrasannaVadhanam coming to theatres on Friday, 03rd May. pic.twitter.com/OuaRerdf6Q
— Aakashavaani (@TheAakashavaani) March 19, 2024