Gorre Puranam | విలక్షణమైన పాత్రలతో తనకంటూ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు టాలీవుడ్ యువ హీరో సుహాస్ (Suhas). గత నెల ‘ప్రసన్నవదనం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంచి విజయాన్ని అందుకున్న ఈ కుర్ర హీరో మరో సినిమాను విడుదలకు సిద్దం చేశాడు. ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం గొర్రెపురాణం(Gorre Puranam). ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తుండగా.. ఫోకల్ సినిమాస్ బ్యానర్పై ప్రవీణ్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. విడుదలకు ఇంకా నాలుగు రోజులే ఉండడంతో ట్రైలర్ను వదిలింది చిత్రయూనిట్.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఒక గొర్రె చేసిన పని వలన రెండు మతాలకు చెందిన ప్రజలు గొడవపడుతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. అయితే అసలు గొర్రెకు హిందు, ముస్లింలకు మధ్య గొడవ ఏంటి.. రెండు మతాలకు చెందిన ఆ ఊరి ప్రజలు అసలు గొర్రెను ఎందుకు చంపాలి అనుకుంటారు. సుహాస్ జైలులో ఎందుకు ఉంటాడు. గొర్రెకు సుహాస్కు సంబంధం ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా సినిమా చూడాల్సిందే.