సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘గాలోడు’. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడు. ఈ నెల 18న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుధీర్ మాట్లాడుతూ…‘మా చిత్ర ట్రైలర్కు మంచి స్పందన వస్తున్నది. దర్శకుడు రాజశేఖర్ రెడ్డితో నేను చేస్తున్న రెండో చిత్రమిది. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్గా మా సినిమా ఆకట్టుకుంటుంది’ అన్నారు. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…‘ఇప్పటిదాకా మా సినిమా నుంచి విడుదల చేసిన పాటలకు, ట్రైలర్కు రెస్పాన్స్ బాగుంది. ట్రైలర్కు 24 గంటల్లో 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ స్పందన సినిమా మీద మాకు మరింత నమ్మకాన్ని పెంచుతున్నది. కాలేజ్ స్టూడెంట్స్తో పాటు యూత్కు బాగా నచ్చుతుంది’ అన్నారు.