బుల్లితెర ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్ అందించే కార్యక్రమాలలో ఢీ షో కూడా ఒకటి. 13 సీజన్స్ సక్సెస్ ఫుల్గా పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో 14వ సీజన్ జరుపుకోనుంది. రీసెంట్గా ఢీ 13 ఫినాలే ఎపిసోడ్ జరగగా, ఇందులో బన్నీ చేతుల మీదుగా కావ్య శ్రీ ట్రోఫీ అందుకుంది. ఇక 14వ సీజన్ని డిసెంబర్ 15 నుండి మొదలు పెట్టనున్న క్రమంలో తాజాగా ప్రోమో విడుదల చేశారు. ఢీ 14: డ్యాన్సింగ్ ఐకాన్ అనే పేరుతో ఈ షో ప్రసారం కానుండగా, ఇందులో నాలుగు టీమ్లతో ప్లాన్ చేస్తున్నారు.
ఢీ జూనియర్స్, ఢీ లేడీస్ స్పెషల్, ఢీ జోడి మరియు ఢీ ఛాంపియన్స్ అనే నాలుగు టీమ్లతో ఢీ 14షో ప్లాన్ చేయబడింది. అయితే ఈ సీజన్లో పలు మార్పులు చేసినట్టు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే అర్ధమవుతుంది. యాంకర్గా ప్రదీప్.. టీమ్లీడర్లుగా హైపర్ ఆది, ‘బిగ్బాస్’ ఫేమ్ అఖిల్ సార్థక్ కనిపించారు. జడ్జిలుగా ప్రియమణి, గణేష్ మాస్టర్ ఉన్నారు. అంతే కాక తొలి ఎపిసోడ్కు ‘లక్ష్య’ హీరోహీరోయిన్లు నాగశౌర్య, కేతిక శర్మ విచ్చేసి సందడి చేశారు.
టీమ్ లీడర్స్ సుధీర్ -రష్మీ జంట, దీపికా పిల్లి, జడ్జి పూర్ణ కనిపించలేదు. అది చూసిన తర్వాత అభిమానులు షాక్ అవుతున్నారు. సుధీర్ లేని ఢీ షోను ఇప్పుడు మేం చూడాలా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఢీ 14లో సుధీర్కు బదులుగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 అఖిల్ను టీమ్ లీడర్గా ఎంపిక చేశారు. దీనిపై అఖిల్ కూడా స్పందించాడు. తాను కేవలం తీన్మార్ డ్యాన్సర్ అని, అలాంటి తనను ఆ షోకు సెలక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. రష్మీ స్థానంలో మోనాల్ రానుందని అంటున్నారు. చూస్తుంటే బిగ్ బాస్ కెమిస్ట్రీని ఇక్కడ పండించనున్నారా అనే అనుమానం కలుగుతుంది.