సుధీర్బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ మంగళవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్ నిర్మిస్తున్నారు. మహేష్ దర్శకుడు. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో సుధీర్బాబు పోలీస్ అధికారిగా కనిపిస్తారు. గత చిత్రాలకు భిన్నంగా ఆయన పాత్ర సరికొత్త పంథాలో సాగుతుంది. తాజా షెడ్యూల్లో కీలక తారాగణం పాల్గొంటున్నారు. ఏప్రిల్ 23వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది’ అని చెప్పారు. భరత్, గోపరాజు రమణ, జెమినీ సురేష్, మైమ్ గోపి, అజయ్త్న్రం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అరుల్ విన్సెంట్, ఆర్ట్: వివేక్, ఎడిటింగ్: ప్రవీణ్పూడి, దర్శకత్వం: మహేష్.