నెపొటిజం గురించి చాలామంది స్టార్కిడ్స్ చాలా సందర్భాల్లో మాట్లాడారు. తాజాగా మహేశ్ మంజ్రేకర్ ముద్దుల తనయ సాయి మంజ్రేకర్ కూడా ఈ అంశంపై తనదైన శైలిలో స్పందించారు. సినీ పరిశ్రమలో నటవారసత్వం అనే అంశంపై ఇటీవల ఆమె మాట్లాడుతూ ‘ఇంటిపేరనేది బలమైన కెరీర్కి గ్యారెంటీ కార్డు కాదు. అది కేవలం ప్రారంభంలో పరిచయాలకూ, తొలి సినిమా అవకాశానికి మాత్రమే సహాయపడుతుంది.
జనానికి కనెక్ట్ కానప్పుడు, ఎంతటి సూపర్స్టార్ వారసులైనా తలదించుకొని వెనక్కెళ్లిపోవాల్సిందే. అందుకే ‘మంజ్రేకర్’ అనే కంఫర్ట్ జోన్ నుంచి పూర్తిగా బయటకు వచ్చి, కేవలం నా కష్టం, అంకితభావంతో ఇండస్ట్రీలో నిలబడాలనుకుంటున్నా. హార్డ్వర్క్, క్రమశిక్షణ, పట్టుదల.. ఈ మూడు మాత్రమే విజయాన్ని శాసిస్తాయి’ అని సాయి మంజ్రేకర్ పేర్కొన్నది. ‘మేజర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన సాయి మంజ్రేకర్.. ప్రస్తుతం తెలుగు చారిత్రాత్మక పానిండియా చిత్రం ‘ఇండియా హౌస్’లో కథానాయికగా నటిస్తున్నది.