బొమ్మాలి రవిశంకర్ కుమారుడు అద్వయ్ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం ‘సుబ్రహ్మణ్య’. పి.రవిశంకర్ దర్శకత్వంలో తిరుమల్రెడ్డి, అనిల్ కడియాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. సినిమా విభిన్నంగా ఉంటుందని, ఎన్నో ప్రత్యేకతల సమాహరంగా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కిస్తున్నాడని, థ్రిలింగ్ ఎలిమెంట్స్తోపాటు కథాపరంగా కొన్ని భక్తికి సంబంధించిన అంశాలు కూడా ఇందులో ఉంటాయని నిర్మాతలు చెబుతున్నారు. అబ్బురపరిచే సాంకేతికతతో తెరకెక్కుతున్న ఈ చిత్రం వెండితెర విజువల్ వండర్గా ఉంటుందని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: రవి బాసూర్, మాటలు: మస్తీ. నిర్మాణం: ఎస్.జి.మూవీ మేకర్స్.