మహిళల పట్ల సినీ పరిశ్రమలో వివక్ష ఉందని అంటున్నది స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను. చిత్ర పరిశ్రమలో 12 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న ఈ తార…తన కెరీర్ ప్రారంభం నుంచి ఈ వివక్షను చూస్తూనే ఉన్నట్లు చెప్పింది. షూటింగ్ లొకేషన్లో సౌకర్యాలు మొదలు పారితోషికాల దాకా మేల్, ఫీమేల్ అనే తేడాలు చూపిస్తున్నారని చెప్పింది.
ఇటీవల తాప్సీ పన్ను మాట్లాడుతూ..‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మాకు ఇచ్చే కార్వాన్లు అగ్గిపెట్టెల్లా ఉండేవి. అదే హీరోలకు, పేరున్న నటులకు డబుల్ డోర్ వెహికిల్స్ ఏర్పాటుచేసేవారు. మేకప్, కాస్ట్యూమ్, హెయిర్ ైస్టెలిస్ట్ వంటి సహాయకుల విషయంలోనూ చిన్న చూపు ఉండేది. నాయికగా పేరు తెచ్చుకున్న తర్వాత కూడా హీరోలతో పోల్చితే మాకు ఇస్తున్న పారితోషికాల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి.
నేను నిర్మాతగా మారిన తర్వాత ఈ తేడాలు సెట్స్లో లేకుండా చూసుకుంటున్నాను. మహిళలకు కావాల్సిన సౌకర్యాలు సమకూర్చుతున్నాను’ అని చెప్పింది. ‘బేబీ’, ‘బదా’్ల, ‘నామ్ షబానా’, ‘సాంద్ కీ ఆంఖ్’ వంటి చిత్రాలతో బాలీవుడ్ స్టార్డమ్ అందుకుంది తాప్సీ. ఇటీవల నిర్మాతగా మారి ఔట్సైడర్స్ ఫిలింస్ అనే సంస్థను స్థాపించింది. ఈ బ్యానర్లో ‘బ్లర్’, ‘ధక్ ధక్’ అనే రెండు చిత్రాలను నిర్మిస్తున్నది. ప్రస్తుతం నటిగా ఆమె ఖాతాలో ‘దొబారా’,‘ఏలియన్’,‘వో లడ్కీ హై కహాన్’, షారుఖ్ ఖాన్ ‘డంకీ’ వంటి చిత్రాలున్నాయి.