Keerthy Suresh | స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెండ్లి వార్తలపై స్పందించారు ఆమె తండ్రి సురేష్ కుమార్. దుబాయ్కు చెందిన వ్యాపారవేత్త ఫర్హాద్ బిన్ లిఖాయత్ కీర్తికి కేవలం స్నేహితుడు మాత్రమేనని ఆయన అన్నారు. ఈ మేరకు సురేష్ కుమార్ ఇటీవల విడుదల చేసిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతున్నది. ఇందులో సురేష్ కుమార్ స్పందిస్తూ…‘ఇటీవల కీర్తి తన మిత్రుడు ఫర్హాన్తో అతని పుట్టినరోజున ఫొటో తీసుకుంది.
ఈ ఫొటో ఆధారంగా తమిళ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను క్రమంగా అన్ని మీడియా సంస్థలూ ప్రచారం చేశాయి. ఫర్హాన్ కీర్తికి మంచి మిత్రుడు. వారు పెండ్లి చేసుకుంటున్నారు అనే వార్తల్లో నిజం లేదు. ఇది తెలిసిన చాలా మంది సన్నిహితులు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. అసత్య వార్తలతో మా కుటుంబంలో మనశ్శాంతి కరువైంది. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి. కీర్తికి పెండ్లి సంబంధం కుదిరితే నేనే మీకు వెల్లడిస్తాను’ అని చెప్పారు.