టాలీవుడ్ డైరెక్టర్ పరశురాం (Parasuram), మహేశ్ బాబు (Mahesh babu)తో క్రేజీ కాంబోలో వస్తున్న చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). కీర్తిసురేశ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ ప్రాజెక్టు మే 12న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో పరశురాం అండ్ మహేశ్ టీం ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. త్వరలోనే మేకర్స్ హైదరాబాద్లో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓ ప్రముఖ వ్యక్తి వస్తున్నారన్న వార్త ఇపుడు ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది.
ఇంతకీ ఆ చీఫ్ గెస్ట్ ఎవరనుకుంటున్నారా..? ఇంకెవరో కాదు. ఒక్క హిట్టు..ఒకే ఒక్క హిట్టుతో మహేశ్ కెరీర్నే మలుపు తిప్పిన మాస్ డైరెక్టర్ వన్ అండ్ ఓన్లీ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh). పూరీ, మహేశ్ కాంబోలో వచ్చిన పోకిరి ఇండస్ట్రీలో రికార్డులను కొల్లగొట్టిన విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా కాలం తర్వాత మళ్లీ పోకిరి సినిమా రేంజ్లో సర్కారు వారి పాట ఉండబోతుందని పరశురాం చెప్పకనే చెప్పాడు.
కొన్ని రోజులుగా పోకిరి సినిమాను గుర్తుకు తెచ్చేలా ప్రమోషన్స్ సాగుతుండటంతో..ఆ సినిమా డైరెక్టర్ నే ఇపుడు చీఫ్ గెస్ట్గా ఆహ్వానించాడని టాక్ నడుస్తోండగా..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అన్నీ కుదిరి పూరీ వచ్చాడంటే మాత్రం మూవీ లవర్స్ , మహేశ్ అభిమానుల ఆనందానికి అవధులుండవనేది పక్కా.
మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో వెన్నెల కిశోర్, నదియా, సముద్రఖని, బ్రహ్మాజీ, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరీజగన్నాథ్కు పరశురాం కజిన్ బ్రదర్ అని తెలిసిందే.