టాలీవుడ్ (Tollywood) యువ హీరో శర్వానంద్ (Sharwanand) నటిస్తోన్న తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavaallu Meeku Johaarlu). కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ చిత్రం మార్చి 4న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. విడుదలకు మరో రెండు రోజులున్న నేపథ్యంలో ఓ క్రేజీ అప్ డేట్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) వాయిస్ ఓవర్ ఇచ్చాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ వాయిస్ అందించారు…సినిమాకు మరింత మ్యాజిక్ యాడ్ అయింది..అంటూ ట్విటర్ ద్వారా క్రేజీ అప్ డేట్ను మేకర్స్ షేర్ చేసుకున్నారు. పుష్ప చిత్రంతో భారీ సక్సెస్ను అందుకున్న సుకుమార్ ఇటీవలే ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రీ రిలీజ్ఈవెంట్కు హాజరైన సంగతి తెలిసిందే. సినిమా ఖచ్చితంగా సక్సెస్ ఊర్వశి, ఖుష్బూ సుందర్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్ డైరెక్టర్..కాగా ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది.
Blockbuster Director @aryasukku garu lended his voice & added his magic to the movie ♥
One more reason to book your tickets now for #AadavalluMeekuJohaarlu!
– https://t.co/Z3buXFR8Bd#AMJOnMarch4th@ImSharwanand @iamRashmika @DirKishoreOffl @ThisIsDSP @SLVCinemasOffl pic.twitter.com/ps0JHMB0ts
— SLV Cinemas (@SLVCinemasOffl) March 2, 2022
పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పుష్ప సినిమాలో శ్రీవల్లిగా డీగ్లామరైజ్డ్ పాత్రలో మెరిసిన రష్మిక మందన్నా..గ్లామరస్ పాత్రలో మెరువనుంది. ఇప్పటివరకు వచ్చిన రషెస్ చూస్తే రష్మిక ఖాతాలో మరో హిట్టు పడ్డట్టేననిపిస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మూడు రోజులు ఆగాల్సిందే.